కరెంట్ అధికారుల నిర్లక్ష్యం.. యువకుడు మృతి

64చూసినవారు
కరెంట్ అధికారుల నిర్లక్ష్యం.. యువకుడు మృతి
కామారెడ్డి - రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంప్ గ్రామంలో ఆదివారం వీచిన ఈదురుగాలులకు చెట్లు మీద పడి విద్యుత్ స్తంబాలు విరిగిపోయాయి. సోమవారం అదే గ్రామానికి చెందిన షేక్ లతీఫ్(29) ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా కిందపడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాడు. స్తంబాలు విరిగిపోయాయని చెప్పినా అధికారులు పట్టించుకోకుండా కరెంట్ సప్లయ్ చేసినందుకే.. నిండు ప్రాణం బలైందని గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్