తమిళనాడుకు చెందిన యువతి నేత్ర పారిస్ ఒలింపిక్స్కు శుక్రవారం అర్హత సాధించింది. ఈ భారత స్టార్ సెయిలర్ వరుసగా రెండో ఒలింపిక్స్కు వెళ్లనుంది. ఆమె 10 రేసుల్లో మొత్తం 67 నెట్ పాయింట్లతో తుది ర్యాంకింగ్లో 5వ స్థానంలో నిలిచింది. తొలి మూడు స్థానాల్లో నిలిచిన సెయిలర్లు నేరుగా ఒలింపిక్స్కు అర్హత సాధించారు. అయితే ఎమర్జింగ్ నేషన్స్ ప్రోగ్రామ్ (ENP) ద్వారా నేత్ర కుమనన్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందింది.