బీహార్లో ఏర్పాటయ్యే జేడీయూ-
బీజేపీ కూటమి ఎక్కువ కాలం కొనసాగదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు నిలవదని తేల్చిచెప్పారు. జేడీయూ-
బీజేపీ ప్రభుత్వం ఏడాది అంతకంటే తక్కువ కాలమే అధికారంలో ఉంటుందని, ఈ విషయం తాను రాసిస్తానని ప్రశాంత్ కిషోర్
చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత మార్పు జరుగుతుందని ఆయన అన్నారు.