వెంకటేశ్ హీరోగా డైరక్టర్ శైలేశ్ 'సైంధవ్' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఫ్యాన్స్తో మూవీ మరో అప్ డేట్ను పంచుకుంది. ఈ నెల 3న సినిమా ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పాటలు ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాయి. కాగా, ఈ నెల 13న మూవీ థియేటర్లలో విడుదల కానుంది.