ఉట్నూర్ ఏజెన్సీలో కొనసాగుతున్న బంద్

53చూసినవారు
ఆదివాసి సంఘాల నాయకుల పిలుపు మేరకు ఉట్నూర్ ఏజెన్సీలో శనివారం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జైనూరులో ఆదివాసి మహిళపై జరిగిన హత్యాచారయత్నానికి నిరసనగా ఆదివాసి సంఘాల నాయకులు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, తదితర మండలాల్లో బంద్ కొనసాగుతోంది. వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు సైతం తిరగడం లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్