ధరణి సమస్యలు పరిష్కరించాలి

65చూసినవారు
ధరణి సమస్యలు పరిష్కరించాలి
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏఐపీకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నంది రామయ్య అన్నారు. రైతులకు నూతన రుణాలు ఇవ్వాలని కోరుతూ గురువారం వారు ఖానాపూర్ పట్టణ తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఇందులో నాయకులు అంకుష్ రావ్, రామన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్