ధూమ్ ధామ్ కళాకారులకు న్యాయం చేయాలి

66చూసినవారు
ధూమ్ ధామ్ కళాకారులకు న్యాయం చేయాలి
తెలంగాణ ధూంధాం కళాకారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆదర్శ కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లింగంపల్లి రాజలింగం కోరారు. బుధవారం సాయంత్రం జన్నారం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ కళాకారులు కీలక పాత్ర పోషించారన్నారు అయితే తెలంగాణ ధూంధాం కళాకారులకు సరైన న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 1న సీఎంను కలిసి తమకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరనున్నామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్