పట్టుదలతో జీవిత లక్ష్యాలు సాధించవచ్చు

78చూసినవారు
పట్టుదలతో జీవిత లక్ష్యాలు సాధించవచ్చు
పట్టుదలతో చదువుకుంటే జీవిత లక్ష్యాలను సాధించవచ్చని మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్శా గౌడ్ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ గౌడ్ కుమారుడు శుభం గౌడ్, యూపీఎస్సీలో 790 ర్యాంకు సాధించి ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యారు. దీంతో శుభం గౌడ్ ను మోకు దెబ్బ నాయకులు శుక్రవారం సాయంత్రం సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మోకు దెబ్బ నాయకులు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్