ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు కడెం మండలంలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. సోమవారం ఉదయం మండలంలోని గంగాపూర్ గ్రామంలో పర్యటించి వర్ష ప్రభావ ప్రాంతాలలో పర్యటించి వివరాలు తెలుసుకుంటారన్నారు. ఆ కార్యక్రమాలలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సకాలంలో తప్పకుండా పాల్గొనాలని వారు కోరారు.