ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జును కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి సుగుణక్క దంపతులు కలిశారు. కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా సుగుణక్క పేరును ఏఐసిసి ప్రకటించింది దీంతో వారు శుక్రవారం ఉట్నూర్ పట్టణంలో ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు సమిష్టిగా కృషి చేద్దామని సూచించారు. ఎంపీ అభ్యర్థికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.