ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 37° పగటి ఉష్ణోగ్రత నమోదయిందన్నారు. రాబోయే మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 36 నుండి 38 డిగ్రీల మధ్య నమోదు కావచ్చన్నారు. అలాగే రెండు, మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.