కొత్త ప్రభుత్వానికి ఏపీ ప్రజలు గట్టి హెచ్చరిక!

72చూసినవారు
కొత్త ప్రభుత్వానికి ఏపీ ప్రజలు గట్టి హెచ్చరిక!
ఏపీలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించింది. అయితే 164 సీట్లు సాధించిన కూటమికి ఏపీ ప్రజలు గట్టి హెచ్చరిక కూడా పంపారు. పథకాలు అందిస్తే చాలు ప్రజలు ఓట్లు వేస్తారని కలలో కూడా అనుకోవద్దని వారి తీర్పుతో స్పష్టం చేశారు. పథకాల రూపంలో రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీని ఓడించి.. కూటమి అభివృద్ధి నినాదానికే పట్టం కట్టారు. ఇప్పుడు వైసీపీ కంటే కూటమి ఎక్కువ పథకాలను ప్రకటించింది. అయితే సంపద సృష్టించి పథకాలు ఇస్తామంటున్న కూటమిపై ఏపీ ప్రజానీకం ఆశలు పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్