ఖానాపూర్ పట్టణంలో తప్పిపోయిన బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించి స్థానికులు మంచి మనసును చాటుకున్నారు. భైంసా డివిజన్ ముజ్గి సమీపంలోని సంగెంకు చెందిన లావణ్య- లక్ష్మణ్ దంపతులు వారి కుమారుడు కార్తీక్ తో ఖానాపూర్ పట్టణంలో జరిగిన శుభకార్యానికి వచ్చారు. అయితే కార్తీక్ ఆడుకుంటూ తప్పిపోయాడు. కార్తీక్ శ్రీరామ్ నగర్ లో తిరుగుతుండగా శుక్రవారం గడ్డి రమేష్, పలువురు గమనించి బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.