![ఫలించిన పూజలు.. కురిసిన వర్షం ఫలించిన పూజలు.. కురిసిన వర్షం](https://media.getlokalapp.com/cache/8f/20/8f203e552ce5d7a8cc791412a3a7a9d4.webp)
ఫలించిన పూజలు.. కురిసిన వర్షం
మృగశిర కార్తె ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా వాన జాడలేదు. వర్షం కురవాలని కోరుతూ కుంటాల మండలంలోని అందాకూర్ గ్రామస్తులు శుక్రవారం పూజలు నిర్వహించారు. లోకేశ్వరం మండలంలోని గడ్చిందా గోదావరి నుంచి జలాలు తీసుకువచ్చి డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామదేవతలకు అభిషేకించారు. సాయత్రం వర్షం కురవడంతో పూజలు ఫలించాయని ఆనందం వ్యక్తం చేశారు.