ముగిసిన అఖండ హరినామ సప్తాహం

51చూసినవారు
తానూర్ మండలం బెంబర్లో గత వారం రోజులుగా కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం మంగళవారం రాత్రి ముగిసింది. ఉదయం నిర్వహించిన కాళ్యకీర్తనలో యోగేష్ మహరాజ్ పాల్గొని భక్తులకు ప్రవచనాలు బోధించారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలు వీడి భక్తి మార్గంలో నడిస్తే ప్రశాంతంగా ఉంటారని పేర్కొన్నారు. పలువురు భక్తులు తులసిమాలలు ధరించారు. అనంతరం ఉట్టి పగులగొట్టి ప్రసాదం పంపిణీ చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్