భైంసా మండలం వానల్పాడ్ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి సుగుణ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.