దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి: సిఐ

72చూసినవారు
దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని భైంసా పట్టణ సిఐ గోపీనాథ్ అన్నారు. సోమవారం పట్టణాలలో నిర్వహించే దుర్గా నిమజ్జన శోభాయాత్ర ప్రాంతాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. అధిక సౌండ్ వచ్చే డీజేలను పెట్టుకోవద్దని అన్నారు. పట్టణ పోలీసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్