రెచ్చగొట్టే పోస్టుపెట్టిన ఒకరి అరెస్ట్: ఎఎస్పీ

64చూసినవారు
ఒక వర్గం మనోభావాలు దెబ్బ తినేలా ఫొటో ఎడిట్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టుపెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు భైంసా ఎఎస్పీ కాంతిలాల్ పటేల్ సోమవారం తెలిపారు. సామాజిక మాధ్య మంలో స్టేటస్ పెట్టిన వ్యక్తిపై ఫిర్యాదు రావడంతో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎడిట్ ఫొటోను పలువురు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని, అలాంటి చర్యలు మానుకోవాలన్నారు. లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్