భైంసా పట్టణంలోని దాబాలలో పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. మద్యం అమ్ముతున్నారన్న పక్క సమాచారంతో పట్టణ సిఐ రాజా రెడ్డి తన సిబ్బందితో కలిసి నాలుగు దాబాపై దాడులు చేసి అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని స్వాదినం చేసుకొని యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దాబాలలో మద్యం అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్ఐ షరీఫ్, గౌస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.