లోకేశ్వరం మండలంలోని రాజుర నుంచి లోకేశ్వరం వెళ్లే మార్గంలో బాగపూర్ గ్రామం వద్ద హరిత హారంలో భాగంగా నాటిన మొక్కలను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు నరికి రోడ్డుపై నిర్లక్ష్యంగా వదిలేశారు. ఈ క్రమంలో రాజుర, మన్మధ్, పాట్పెల్లి, ఎడ్డూర్ గ్రామస్తులు లోకేశ్వరం మండల కేంద్రానికి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.