డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. ఐదేళ్లలో కేంద్రం విడుదల చేసిన రూ.1066 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అయితే ఆ నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు రిలీజ్ చేయలేదని అధికారులు ఆయనకు తెలిపారు. దీంతో పూర్తి వివరాలు సమర్పించాలని పవన్ అధికారులను ఆదేశించారు.