భద్రతా బలగాల కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

55చూసినవారు
భద్రతా బలగాల కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా గండోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఉగ్రవాదులే ఇటీవల భారత సైన్యంపై కాల్పులు జరిపి ఉంటారని అనుమానిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇటీవల వరుస దాడులకు పాల్పడుతున్నారు. దీంతో దోడా, రాజౌరీ, పూంచ్‌ ప్రాంతాల్లో ఉగ్రవాదుల్ని తుడిచిపెట్టే ఆపరేషన్‌ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్