రూ. 6.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
గంజాయిని సరఫరా చేస్తున్న ఓ దొంగల ముఠాను నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామం వద్ద శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం తెలిపారు. 44 జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుండి అదిలాబాద్ వెళ్తున్న బొలెరో వాహనం తనిఖీ చేయగా రూ. 6. 5 లక్షల విలువైన 24. 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.