దుబాయ్ లో గుండెపోటుతో గంజాల్ వాసి మృతి

572చూసినవారు
దుబాయ్ లో గుండెపోటుతో గంజాల్ వాసి మృతి
సోన్ మండలం గంజాల్ గ్రామంలో విషాదం నెలకొంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. పాలెపు గంగయ్య (43) అనే వ్యక్తి మూడు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళాడు. గల్ఫ్ లో పనిచేస్తుండగా ఈనెల 12న గుండెపోటుతో మృతి చెందాడు. అతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేల ప్రభుత్వం కృషి చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్