నన్ను క్షమించండి : విశాల్‌

85చూసినవారు
నన్ను క్షమించండి : విశాల్‌
నటుడు విశాల్‌ కథానాయకుడిగా దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రత్నం’. ఈనెల 26న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని నరసింహారెడ్డి కాలేజీలో ఓ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. చివరి క్షణంలో దానిని విశాల్‌ రద్దు చేశారు. ఈ విషయంపై అభిమానులకు, సినీ ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ ఒక లేఖ విడుదల చేశారు. అభిమానులతో గడిపే మధురమైన క్షణాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్