పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గంలో ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు శుక్రవారం తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.