తమిళనాడు ప్రభుత్వంపై నిర్మలా సీతారామన్ మండిపాటు

555చూసినవారు
తమిళనాడు ప్రభుత్వంపై నిర్మలా సీతారామన్ మండిపాటు
తమిళనాడు ఆలయాల్లో రాముడి పూజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించక పోవడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం హిందూ వ్యతిరేక చర్యగా ఆమె అభివర్ణించారు. ఈ నెల 22న రామ మందిరంలో జరిగే రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం లైవ్ టెలికాస్ట్‌ను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని ఆమె పేర్కొన్నారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు స్పందిస్తూ.. రాముడి పూజలపై ఎలాంటి నిషేధం లేదన్నారు.

సంబంధిత పోస్ట్