భారత అంపైర్ నితిన్ మేనన్ ఇటీవల 5వ సారి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకున్నారు. ఇందౌర్కు చెందిన నితిన్ 2020లో తొలిసారి ప్యానెల్లోకి వచ్చారు. ఎస్.వెంకట్రాఘవన్, ఎస్.రవి తర్వాత ఎలైట్ ప్యానెల్లో చోటు పొందిన మూడో భారతీయ ఎంపైర్గా నితిన్ ఘనత సాధించారు.