కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాని మోదీ ఈ సారి ఇతరులపై ఆధారపడాల్సి పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్డీయే భాగస్వాముల సహకారం తీసుకుంటే తప్ప ఆ పార్టీ కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో బీజేపీకి టీడీపీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ సారధ్యంలోని జేడీయూ మద్దతు తప్పనిసరి. అయితే, జూన్ 8న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకూ నితీశ్ కుమార్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు జేడీ(యూ) వర్గాలు తెలిపినట్లు ఇండియా టుడే నివేదించింది.