ఆలూర్: రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

82చూసినవారు
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండల కేంద్రంలో దొంగతనం జరిగింది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తుల వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన గౌడ కులస్తులు శనివారం ఉదయం ఆలయానికెళ్లగా ఆలయం తలుపులు పగలగొట్టి ఉండడంతో లోనికెళ్లి చూశాడు. ఆలయ తలుపులను పగలగొట్టి హుండీను గుడి బయట వదిలేశారు. శుక్రవారం రాత్రి దొంగతనం జరిగినట్టు భావించి గ్రామస్తులు పోలీసులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్