కోనేరులో పడి వ్యక్తి మృతి

12826చూసినవారు
కోనేరులో పడి వ్యక్తి మృతి
కోనేరులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నందిపేటలో ఆదివారం కలకలం రేపింది. మల్కాపూర్ గ్రామానికి చెందిన బాడోళ్ల గంగాధర్ శనివారం ఎల్లమ్మ ఆలయానికి వెళ్లారు. ఆలయ దర్శనానికి ముందు స్నానం ఆచరించడానికి కోనేరుకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఆదివారం కోనేరులో మృతదేహన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాహుల్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్