సాలూరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం( లైబ్రరీ) అభివృద్ధికి పాఠకుల సౌకర్యానికి సమిష్టిగా కృషి చేద్దామని గ్రామ పెద్దలు అన్నారు. ఆదివారం లైబ్రరీ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ పెద్దలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణ పై మాట్లాడారు. లైబ్రరీకి వచ్చే పాఠకుల కోసం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.