నవీపేట్ తాహసిల్దార్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నేతలు

81చూసినవారు
నవీపేట్ కు బదిలీపై వచ్చిన నూతన తహసిల్దార్ వెంకటరమణను మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల దండలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. డొంకేశ్వర్ తహసిల్దార్ గా పని చేసిన వెంకటరమణ ఈనెల 13న నవీపేట్ తాహసిల్దారుగా బాధ్యతలు స్వీకరించారు. మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎస్కే మూస, ఎస్ కే. జబీర్, అవేస్, ఫిరోజ్, బుడ్డా సంజీవరెడ్డి, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్