నవీపేట్
మండల కేంద్రంలో శుక్రవారం కూరగాయల సంతలో ఓ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాపర్లు బాలికను తాకడంతో ఒక్కసారిగా మూర్ఛపోయింది. దీంతో నలుగురు అనుమానితులను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఎస్సై యాదగిరి గౌడ్ అనుమానితులను విచారించి వివరాలను వెల్లడి
ంచారు. మహంతంలో ఇటుక బట్టీలో పనిచేసే వలస కార్మికులని తేలింది. వారాంతపు సంతలో కూరగాయలు కొనడానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.