ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు ఘన నివాళులు

81చూసినవారు
ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు ఘన నివాళులు
బోధన్ పట్టణంలోని పిఆర్టీయు భవన్ లో బుధవారం ప్రొఫెసర్ సాయిబాబా చిత్ర పటానికి మానవ హక్కుల వేదిక నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు ఘన నివాళులు అర్పించారు. మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు గడ్డం గంగులు మాట్లాడుతు జీవితాంతం పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడినాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి. వరదయ్య, అహ్మద్, గౌతం కూమార్, గంగాధర్ అప్పా, గౌస్, సురేష్, మోసీం, పోశేట్టి, సాయికుమార్ లక్ష్మణ్ గౌడ్, నాగరాజు, ఖురేషీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్