పిట్లం మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి

72చూసినవారు
పిట్లం మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి
పిట్లం మండల చేనేత సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం జిల్లా కార్యదర్శి నీలకంటి సంతోష్, మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు సన్నపుల మధు, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గుర్రపు బాలరాజు, చేనేత సంఘం సభ్యులు లోక మనోహర్,చుక్క శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్