ధాన్యం కుప్పను ఢీకొని వ్యక్తి మృతి

13295చూసినవారు
ధాన్యం కుప్పను ఢీకొని వ్యక్తి మృతి
ధాన్యం కుప్పను ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ శివారున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన డప్పు రాములు(50) , జలంధర్ ద్విచక్ర వాహనంపై గడ్కొల్ గ్రామానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు ధాన్యం కుప్పలను ఢీకొన్నాడు. దీంతో రాములు అక్కడికక్కడే చనిపోయాడు. జలంధర్ కు గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో ప్రభుత్వసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు ఎసై నర్సింహులు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్