బిజెపి ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ ధర్నా..

56చూసినవారు
నవీపేట్ మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రైతులకు షరతులు లేని రుణమాఫీ చేయాలని మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేసి గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిందని గొప్పలు చెప్పుకుంటుందని కానీ సాంకేతిక లోపాలను చూపి రుణమాఫీ చేయకుండా రైతులను మోసగిస్తుందని ఆన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్