డి శ్రీనివాస్ కు నివాళులు అర్పించిన కురుమ సంఘం సభ్యులు

56చూసినవారు
డి శ్రీనివాస్ కు నివాళులు అర్పించిన కురుమ సంఘం సభ్యులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కురుమ సంఘం సభ్యులు ఆదివారం నిజామాబాద్ నగర కురుమ సంఘం పత్తి వీక్లీ మార్కెట్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం మాజీ సెక్రెటరీ మల్లేష్ మాట్లాడుతూ తమ సంఘానికి డీఎస్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, శ్రీనివాస్, కాంతారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్