నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయంలో శనివారం కలెక్టర్ నేతృత్వంలో జరిగిన జిల్లా ఇంటలిజెన్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ఎలాంటి ప్రలోభాలకు అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు అంకిత భావంతో పని చేయాలని అన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.