రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సదాశివనగర్ గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. బైక్ పై నుంచి కామారెడ్డి వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో ఒకరైన సమియోద్దీన్ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ చెప్పారు.