ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డుకు నామినేట్ అయిన రిషభ్‌ పంత్

60చూసినవారు
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డుకు నామినేట్ అయిన రిషభ్‌ పంత్
భారత యువ క్రికెటర్ రిషభ్ పంత్‌ అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డ్స్‌ 2025లో ‘కమ్‌ బ్యాక్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారానికి పంత్ నామినేట్ అయ్యారు. భారత క్రికెటర్లలో పంత్ కంటే ముందు సచిన్ ఒక్కరే ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఏప్రిల్ 21న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరంలో ఈ అవార్డ్స్‌ ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. 2022లో పంత్‌కు యాక్సిడెంట్ కాగా అతడు కోలుకోవడానికి 14 నెలలు పట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్