May 11, 2024, 02:05 IST/బోధన్
బోధన్
ఎస్సీ రిజర్వేషన్ అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
May 11, 2024, 02:05 IST
ఎస్సీ రిజర్వేషన్ అమలు పరచడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ కోఆర్డినేటర్ సురేష్ డల్ల మహాజన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతు ప్రచారం చేపట్టారు. ప్రతి ఒకరు చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. నాయకులు, తదితరులు ఉన్నారు.