రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గులాబీ బాస్, BRS చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గాలి అనిల్ కుమార్ ను ఎన్నికలో బరిలో దింపనున్నట్లు వెల్లడించారు. కాగా, గతంలో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.