ప్రభుత్వం నుంచి వేధింపులు ఉండవు: ఉత్తమ్‌

59చూసినవారు
ప్రభుత్వం నుంచి వేధింపులు ఉండవు: ఉత్తమ్‌
హైదరాబాద్: మాదాపూర్‌ హైటెక్స్‌లో మూకాంబికా రైస్‌, గ్రెయిన్‌టెక్‌ ప్రదర్శన మొదలైంది. మూడు రోజుల పాటు జరిగే ప్రదర్శనను మంత్రి ఉత్తమ్‌ ప్రారంభించారు. కంపెనీల స్టాళ్లను మంత్రి ఉత్తమ్‌ పరిశీలించారు. రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమను ముఖ్యమైన రంగంగా గుర్తిస్తామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం నుంచి వేధింపులు ఉండవన్నారు. రైస్‌ మిల్లింగ్‌ వ్యాపారం, అనుమతులు, స్థాపన సులభతరం చేస్తామన్నారు. రైతులు, మిల్లర్లకు మేలు జరిగేలా చూస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్