గాంధీభవన్లో మీడియాతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ 'ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు. కేసీఆర్ను రక్షించేందుకు బీజేపీ సీబీఐ విచారణ కోరుతుందని, బీఆర్ఎస్ను తమ అనుబంధ సంస్థగా మార్చిందని ఆరోపించారు. ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు పెట్టి బీజేపీ వేధించాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి భయపడే పరిస్థితి లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలని కోరారు.