AP: పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ వేసిన పిటిషన్పై తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు చెబుతామని పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీల్ లేకున్నా చెల్లుతుందని ఈసీ చెప్పగా.. దాన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును వాయిదా వేసింది.