తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఘాట్రోడ్డులో ఒకటో మలుపు వద్ద అదుపుతప్పి జీపు బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో పలువురు భక్తులకు స్వల్ప గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.