ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా కర్ణాటకలోని అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్ (ఆడిట్) నుంచి రూ.9.45 కోట్లకు సంబంధించిన నోటీసులను అందుకుంది. కర్ణాటక పన్ను నియంత్రణ సంస్థ జొమాటోను 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.9.45 కోట్ల జీఎస్టీ చెల్లించాలని తన నోటీసులో పేర్కొంది. దీనిపై జొమాటో స్పందిస్తూ.. సంబంధిత అథారిటీ ముందు అప్పీల్ దాఖలు చేస్తామని పేర్కొంది.