NTA నో ట్రస్ట్ ఏజెన్సీగా మారింది: ప్రియాంక

58చూసినవారు
NTA నో ట్రస్ట్ ఏజెన్సీగా మారింది: ప్రియాంక
పేపర్ లీక్‌లపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ట్వీట్ చేశారు. 'BJP ప్రభుత్వంలో NTA నో ట్రస్ట్ ఏజెన్సీగా మారింది. పరీక్షలు ఒక విషాదంగా మారాయి. బీజేపీ హయాంలో ఈ దుర్ఘటనలకు దేశంలోని లక్షలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు బలిపశువులుగా మారుతున్నారు. ఎవరు బాధ్యత వహిస్తారు? ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?' అని ఆమె ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్